Government Job Updates : భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ASRB 2021 సంవత్సరానికిగాను నెట్, ARS ప్రిలిమినరీ, NTO లో సంయుక్త నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
1. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ :
రాష్ట్రానికి సంబంధించిన, ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీ లో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు..
అర్హతలు :19/9/2021 నాటికి సంబంధిత విభాగాలు, స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 1/1/2021 నాటికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. వయో పరిమితి లేదు. ఎన్నిసార్లైనా ఈ పరీక్షలు రాయవచ్చు.
ఎంపిక విధానం : కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఆధారంగా.
పరీక్షా విధానం : 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
2. అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ARS:
ఏఆర్ఎస్ లో ప్రిలిమ్స్, మెయిన్స్, వైవా, వాయిస్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను ఐకర్ లో సైంటిస్టులు గా తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు : 222
అర్హతలు : సంబంధిత విభాగంలోనీ స్పెషలైజేషన్లతో మాస్టర్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 1/1/2021 నాటికి 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రయత్నాల సంఖ్య వారు 6 (అన్ రిజర్వ్డ్ కేటగిరి), ఓబిసి పిడబ్ల్యుడి అభ్యర్థులకు 9.
ఎంపిక విధానం : కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఆధారంగా ప్రిలిమ్స్, మెయిన్స్, వైవా, వాయిస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం : 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష 240 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను వైవా వాయిస్ కి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ NTO :
దీని ద్వారా ఐకార్ హెడ్ క్వార్టర్స్, ఇతర పరిశోధనా సంస్థలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు : 65
అర్హతలు : 19/9/2021 నాటికి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 25/4/2021 నాటికి 21- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బెస్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షా విధానం : 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 5/4/2021.
దరఖాస్తులకు చివరి తేదీ : 25/4/2021.
పరీక్షా తేదీ : 2021 జూన్ 21 నుంచి 27 వరకు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?