కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్రరాజ్యం సైతం కరోనా వైరస్ అంటే గజగజ వణుకుతుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని ప్రాణాలు బలితీసుకుంది. కొన్ని కోట్లమంది ఈ కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.
అయితే ఈ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. బయటకు వచ్చిన సమయంలో ఖచ్చితంగా మాస్కు ధరించాలి, శానిటైక్సర్ ఉపయోగించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే సమస్యలు తప్పవు. అయితే ఈ నియమాలు పాటిస్తూనే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
ఇక అందులో ఒకటి జామపండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయ్. ఇందులో పోషకాలతో పాటు మరెన్నో విటమిన్లు ఉంటాయ్. అతి తక్కువ ధరకే లభించే ఈ పండుతో కరోనా లక్షణం అయినా జలుబును మాయం చేస్తుందట. అంతేకాదు జామపండు తినడం వల్ల రోగనిరోధకశక్తి కావాల్సినంత పెరుగుతుందని, జమ ఆకులలోను ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
జమ పండు అనేకరకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించి ఐరన్, కాల్షియం పుష్కలంగా పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు దూరం అవుతాయి. గుండె జబ్బుతో బాధపడేవారు రోజు భోజనంలో జామపండు గుజ్జును తప్పని సరిగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయ్. జామపండు డయాబెటిస్ ని కూడా తగ్గిస్తుంది.