Mobile Copying: టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ లాభాలు ఎన్ని చేకూర్చుతున్నాయో మరోపక్క నష్టాలు కూడా… అనే దాపురించాయి. ముఖ్యంగా మొబైల్ వచ్చాక. ప్రస్తుతం మొబైల్ మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. మనిషి సమయాన్ని చాలా వరకు మొబైల్ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒకప్పుడు మనుషులు.. మరొక మనిషితో మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవారు. కానీ ఇప్పుడు మొబైల్ తో గడపడానికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో మనుషుల మధ్య బంధాలు కల్తి అయిపోయాయి. సంసార జీవితంలో కూడా మొగ్గుడు పెళ్ళాల ..మధ్య మొబైల్ అనేక చిచ్చులు పెడుతూ ఉంది. అటువంటి మొబైల్ ఫోన్ ని హర్యానా రాష్ట్రం లో పదవ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాసే ప్యాడ్ లో పట్టుకొచ్చి… పరీక్ష నిర్వహణ అధికారుల కళ్ళు గప్పి మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున కొట్టడం అక్కడ మీడియాలో సంచలనం రెప్పింది.
హర్యానా రాష్ట్రంలో ఈ మాస్ కాపీయింగ్ కి సంబంధించి దాదాపు 450 కి పైగా కేసులు నమోదయినట్లు.. ఫిర్యాదులు వచ్చినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దీంతో వెంటనే అలర్ట్ అయినా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న… 10 మంది పరీక్ష నిర్వహణ అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. చాలా చోట్ల పదవ తరగతి పరీక్ష విద్యా కేంద్రాలలో అధికారులు తనిఖీలు చేపట్టారు ఒక విద్యార్థి పరీక్ష కేంద్రంలో కాపీ కొట్టిన విధానం.. సంచలనం రేపింది. ఏకంగా పరీక్ష రాసే ప్యాడ్ లో… మొబైల్ ఫోన్ అతికించి… వాట్సాప్ సందేశాల ద్వారా జవాబులు కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుండగా వెంటనే చెకింగ్ స్క్యాడ్ సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
హర్యానా రాష్ట్రం ఫతేహాబాద్ లో భూతాన్ పరీక్ష కేంద్రంలో… ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చెకింగ్ స్క్వాడ్ అధికారులతోపాటు పరీక్ష నిర్వాహణ అధ్యాపకులు కూడా… ఈ తతంగం మొత్తం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వార్త హర్యానా మీడియాలో సంచలనం రేపుతోంది. చాలావరకు హర్యానా రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలలో పాస్ అవ్వడానికి విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్న ట్లు.. భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్నట్లూ… ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర విద్యాశాఖ ఎక్కడికక్కడ అనుమానం వస్తున్న పరీక్షా కేంద్రాలలో తనిఖీలు చేస్తున్నారు.