చాలా మంది చిరిగిన నోట్ల చెల్లక పోవడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. నోట్లు కోంచం చిరిగిన కూడా వాటిని ఎవరు తీసుకోరు. ఇలాంటి ఇబ్బందులను చాలా మంది ఎదుర్కొంటారు. విలువ తక్కువ ఉన్న నోట్లు చిరిగిన పర్వాలేదు. కానీ విలువ అధికంగా ఉన్న నోట్లైతే కష్టమే. ఇలాంటి వారికి ఊరట కలిగిస్తూ ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను తీసుకోవచ్చింది. చిరిగిన నోట్ల స్థానంలో తిరిగి కొత్త నోట్లను చెల్లించే విషయంలో 2009లో కేంద్ర బ్యాంక్ కొన్ని నియమాలను జారీ చేసింది. ఇటివలే మరిన్ని మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.1 నుంచి రూ.2 వేల నోటు వరకు ఎంత చిరిగిన వాటిని తీసుకొని ఎంతో కొంత విలువ తిరిగి పోందడానికి అవకాశం కల్పించింది. రూ.1 నుంచి రూ.20 వరకు సగం నోటు ఉన్నా తిరిగి పూర్తి విలువ ను చెల్లించే విధంగా మార్గదర్శకాలు జారీచేపింది. ఆపై నోట్లకు ఎక్కవ భాగం ఉన్న వాటికి పూర్తి విలువ తక్కువ భాగం ఉన్న వాటికి సగం విలువ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ,చిరిగిన కరెన్సీ.. పూర్తి విలువ పోందలంటే నోటు ఎంత మొత్తంలో ఉండాలో రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్-2018 పేరిట రూపోదించిన ఉత్తర్వులు నిర్దేశించింది.
కరెన్సీ నోట్లు చిరిగినా, రంగు పడినా బ్యాంకులు స్వీకరించడం లేదని వస్తున్న ఫిర్యాదుల సంఖ్య అధికంగా ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏమాత్రం నోట్లు చిరిగినా,రంగు మారిన ,రాతలున్నా తీసుకోవాల్సిందేనని, అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది. నోట్లపై రాతలు రాయరాదని, చిరిగితే బ్యాంకులు తీసుకోవాని దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే షల్ మీడియా ప్రచారాన్ని నమ్మరాదని . రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. అలాగే పది రూపాయల నాణాలు సైతం చెల్లుతాయని తెలిపింది.