Caesalpinia Bonduc: గచ్చకాయ చెట్టు.. ఇప్పటి పిల్లలకు తెలిక పోవచ్చు.. మన పెద్ద వాళ్లకు ఇవి సుపరిచితమే.. ఈ చెట్టు కు ముళ్ల కాయలు ఉండేవి.. ఆ కాయల లోపల ఉన్న చిన్న చిన్న కాయలతో వారు గోలీల ఆటలు ఆడుకునే వారు.. గచ్చకాయ చెట్టు, బెరడు, ఆకులు, కాయలు మన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. ఈ చెట్టు మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తుందో తెలుసుకుందాం..!!
గచ్చకాయ చెట్టు పూలను సేకరించి రసం తీయాలి. ఈ రసాన్ని ప్రతి రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. అంతే కాకుండా ఈ రసం తాగుతుంటే మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే తగ్గుతాయి. గచ్చకాయ లోపల ఉన్న గింజలు రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయం ఆ గింజలు తిని ఆ నీటిని తాగాలి. ఇలా 15 రోజులు చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఈ చిట్కా ప్రయత్నించేటప్పుడు ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఫలితాలు మీరే గమనించవచ్చు. షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చిన తరువాత ఈ నీటిని తాగడం మానేయాలి. అందుకోసం ప్రతి నాలుగు రోజులకు టెస్ట్ చేయించుకోవాలి . అదే షుగర్ లెవల్స్ కంట్రోల్ లోకి వచ్చాయని తెలిసాక మానేస్తే మంచిది. లేకపోతే అలాగే తాగుతూ ఉంటే షుగర్ మళ్లీ డౌన్ అవుతుంది. అది కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని గుర్తుంచుకోండి.
గచ్చకాయ లోపల ఉన్న గింజలు జ్వరాన్ని తగ్గిస్తాయి.. గజ్జి కాయ లోపల ఉన్న గింజలను నీటితో కలిపి నూరి నీటిని పొట్టపై రాస్తే జ్వరం తగ్గుతుంది. గచ్చకాయ చెట్టు పుల్లలను ముళ్ళు లేకుండా సేకరించాలి. ఆ పుల్లలతో పళ్ళు తోముకుంటే చిగుళ్ల నుంచి రక్తం కారటం, దంత సమస్యలు రాకుండా చేస్తుంది. గచ్చకాయ చెట్టు ఆకులను తీసుకొని శుభ్రం చేసుకొని ఆముదం లో వేడి చేసుకుని వృషణానాలకు కట్టుకుంటే కచ్చితంగా నాలుగు రోజులలో వరిబీజం తగ్గుతుంది. వరిబీజం ప్రారంభ దశలో ఉన్న వారు ఇలా చేస్తే త్వరగా తగ్గుతుంది. అర కప్పు మజ్జిగలో చిటికెడు గచ్చకాయ గింజలు పొడి ని ఉప్పు ఇంగువ కలిపి 40 రోజులు తాగాలి. ఇలా చేస్తే అల్సర్, గ్యాస్ థైరాయిడ్ సమస్యకు, కడుపు నొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
చిటికెడు గచ్చకాయల పొడిలో ఐదు మిరియాలు కలిపి తీసుకుంటే రుతుక్రమం సరిగ్గా వస్తుంది. ఇలా తీసుకుంటే రుతుక్రమంలో వచ్చే అనేక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. గచ్చకాయ ఆకులను ఆముదం లో వేయించి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి ఉన్నచోట వేసి కట్టుకడితే చాలు.. ఇలా చేస్తే కీళ్ళవాపు, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్ అన్నీ తగ్గుతాయి. గచ్చకాయ గింజలను నీటితో కలిపి నూరి పైపూతగా రాస్తే కుష్టు వ్యాధి తగ్గుతుంది. గచ్చకాయ గింజల పొడిని మూడు చిటికెలు తీసుకుని పాలలో వేసుకుని తాగితే కాలేయ సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వారు గచ్చ ఆకులను నేతితో వేయించి దీనిని బార్లీ గింజలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. గచ్చ ఆకులను మెత్తగా నూరి మొలలు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అలాగే మూడు గ్రాముల గచ్చా ఆకులను ముద్దగా నూరి ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే త్వరగా మొలల సమస్య నుంచి బయట పడతారు. గచ్చ ఆకులను, వేప ఆకులను ముద్దగా నూరి గజ్జి తామర ఎర్ర దురద ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి. దీన్ని అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చు.