Nalleru: ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. వాటి విలువ తెలుసుకుని ఆచరిస్తే అవే రత్నాలు గా భావిస్తాము.. వాటి ప్రయోజనాలు మనకు లేకపోతే వాటిని పిచ్చి మొక్కలు గా అనుకుంటాం.. ప్రతి మొక్క లోనూ బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. అటువంటి కోవకు చెందినదే నల్లేరు మొక్క..!! దీనినే నల్లేరు, వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంయోజక అని పిలుస్తారు..!! ఇది విరిగిన ఎముకలను అతికిస్తుంది. దీనిని అస్థి సంయోజక అంటారు. ఎముకలను రక్షిస్తుంది కాబట్టి ఇది అస్థి సంహరక అయ్యింది.. నల్లేరు మొక్క చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!
Nalleru: నల్లేరు మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
నల్లేరు ఎముకలను రక్షిస్తుందని, విరిగిన ఎముకలను అతికిస్తుంది అని తెలుసుకున్న పరిశోధకులు వీటి పై ప్రయోగాలు నిర్వహించారు. వీటి ఫలితాలను చూసి పరిశోధకులు నివ్వెరపోయారు.. ఇందుకోసం జంతువుల పై 21 రోజులు పరిశోధనలు చేసి ఎముక అతుక్కోవడన్ని ఎక్స్ రే ద్వారా గమనించి ఆశ్చర్యపోయారు. నల్లేరు మొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరుగుతుంది. నల్లేరు మొక్క లో కాల్షియం, బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, అస్బార్బిక్ ఆమ్లం, బీటా సిస్టో స్టరాల్, విటమిన్ సి, మాంగనీస్ పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిని పచ్చడి పులుసు కూరగా వండుకొని తింటారు. దీనివలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
విరిగిన ఎముకల అతికించడానికి నల్లేరు రసం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు సరైన మోతాదులో నల్లేరు గుజ్జును తీసుకుంటే ఎముకల అతుక్కుంటాయి. నల్లేరు ను పొయ్యి కొమ్ము లో మగ్గించి వీటిని దంచి రసం తీయాలి. వీటి రసానికి సమాన మోతాదులో అవు నెయ్యి కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న లేని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నెయ్యిని ఉదయం, రాత్రి ఒక ఒక గ్లాసు గోరువెచ్చని ఆవుపాల లో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరు గుజ్జు ను ఎముకలు విరిగిన చోట రాసి దానిపైన దూది వేసి కట్టుకట్టాలి ఇలా చేస్తూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరు గుజ్జు తీసి 10 ml నీటిలో కలిపి తాగాలి ఇలా నాలుగు రోజులు రెండు సార్లు తాగితే చాలు. ఒకవంతు నల్లేరు గుజ్జు కు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టె లా తయారు చేసుకుని తింటే కొండ నాలుక, కోరింత దగ్గు తగ్గుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?