Ramaphalam: మనందరికీ సీతాఫలం గురించి తెలుసు.. కానీ రామ ఫలం గురించి మాత్రం అతి తక్కువ మందికే తెలుసు.. ఈ పండులో కూడా విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఈ పండు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
సీతాఫలం తో పోల్చుకుంటే రామాఫలం లో గింజలు తక్కువగా ఉంటాయి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది అలసట నీరసం నిస్సత్తువ ను పోగొడుతుంది ఇందులో విటమిన్ సి ఉంది ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇంకా విటమిన్ బి, పెరాడిక్సిన్ కూడా ఉన్నాయి. ఇవి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. నరాల సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్ పోగొడతాయి.
ఈ పండులో విటమిన్ బి 6 సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తనాళాలలో కొవ్వు చేరకుండా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కలిగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లను నిరోధిస్తుంది. కిడ్నీల పనితీరును వేగవంతం చేస్తుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్త హీనతతో బాధపడుతున్న వారికి ఈ పండు చక్కటి ఔషధంగా చెప్పవచ్చు.