Walking: నేటి ఉరుకుల పరుగుల జీవితం లో మనిషి నడవడమే మరచిపోతున్నాడు.. ప్రతి చిన్న పనికి బైక్, ఆటో మీద ఆధారపడుతున్నడు ఈ మర మనిషి.. ఒక మనిషి రోజు మొత్తం మీద కనీసం ఒక గంట అయినా నడవాలి.. నడవకపోతే బోలెడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ప్రతిరోజు ఊ ఏవిధంగా నడిస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం..!!
ఉదయాన్నే చల్లటి గాలిలో పక్షులు కిలకిలా రావాల మధ్య నులి వెచ్చటి సూర్యకిరణాలు మేని తాగుతుంటే అలా అలా హాయిగా నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది.. సాధారణంగా నడిచేటప్పుడు ఎక్కువమంది చెప్పులు లేదా షూ వేసుకుంటారు.. నడవడం ఆరోగ్యానికి మంచిదే.. అయినా చెప్పులు లేదా షూ ఉపయోగించకూడదు..
ఉట్టి పాదాలతో నడిస్తే మంచిది. అలానే సిమెంటు రోడ్ల పై, గరుకుగా ఉన్న ప్రదేశంలో కాకుండా.. పచ్చి గడ్డి మీద లేదంటే మట్టి నేలమీద, ఇసుక మీద నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉత్త పాదాలతో నడిచేటప్పుడు పాదాలలోని నరాలన్నీ ఉత్తేజితమై చక్కటి రక్తప్రసరణ జరుగుతుంది.. మెదడుకు మంచిదని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ మానవ శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి తో బాధపడే వారికి ఈ నడక ఎంతో మేలు చేస్తుంది.. అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు సైతం మాయమవుతాయి. కండరాల బలహీనత, మధుమేహం సమస్యతో బాధపడేవారికి ఈ నడక చాలా ఉపయుక్తంగా ఉంటుంది.. ఇలా గడ్డి, మట్టి, ఇసుక నేలలో నడిస్తేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని గమనించాలి. అదే నగరాల్లో జీవిస్తున్న వారయితే దగ్గరలోని పార్క్ కి వెళ్లి ప్రయత్నించండి. మీరు కూడా ఉత్త పాదాలతో నడిచి చూడండి తేడా మీకే తెలుస్తుంది.. ఇలా ఉత్త పాదాలతో వారానికి ఒక్కసారైనా నడవండి..