Pranitha: “ఏం పిల్లో.. ఏం పిల్లడో” ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత.. “అమ్మో.. బాపుగారి బొమ్మో” పాటతో బాపుగారి బొమ్మగా ముద్ర వేసుకుంది.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ముద్దుగుమ్మ.. సడన్ గా ప్రణీత ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని తన అభిమానులకు అందరికీ షాక్ ఇచ్చింది ఈ బాపుగారి బొమ్మ..
బెంగుళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను ప్రణీత పెళ్లి చేసుకుంది.. అతికొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో బెంగళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రణీత పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.. సడెన్ గా ప్రణీత పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు..చాలా కాలంగా సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూసిన ప్రణీత ఆఫర్లు రాకపోవడంతో, వివాహం చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది.. వ్యాపారవేత్త నితిన్ ని పెళ్లి చేసుకుంది.
ఈ విషయంపై స్పందించిన ప్రణీత ఈ విధంగా మాట్లాడారు. నితిన్ నేను చాలాకాలంగా స్నేహితులం. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేశాము. వారు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నా వ్యక్తిగత విషయాలు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు అని ప్రణీత తెలిపింది. లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది ఆకలిని తీర్చింది, నిర్విరామంగా సేవలు చేస్తూ ఉంది. ప్రస్తుతం ప్రణీత హంగామా 2, భుజ్ అనే సినిమాలో నటిస్తోంది. కన్నడంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది.