Hyderabad: భారత దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ నగరం పిలవబడటం తెలిసిందే. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా.. హైదరాబాద్ రోజు రోజుకి రకరకాల విశిష్టతల దక్కించుకుంటుంది. అనేక రింగ్ రోడ్డు లు.. ఫ్లైఓవర్లు.. కేబుల్ బ్రిడ్జ్.. ఇటీవల 10 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ట్యూనల్ రహదారి ఏర్పాట్లకు రెడీ అవ్వడం తెలిసిందే. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ హైదరాబాద్ నగరంలో..అప్పట్లో అమెరికాకి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అతని కూతురు ఇవాంకా ట్రంప్.. అంతర్జాతీయ బిజినెస్ సమావేశం ఏర్పాటు చేయటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆర్థికంగా ఇంకా అనేక రీతులుగా హైదరాబాద్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే చెరగని ముద్ర వేసుకుంది. అటువంటి హైదరాబాద్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ దృష్టిలో మరో విశిష్ట తగ్గించుకుంది. అదేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక చెట్లు కలిగిన నగరాలలో.. హైదరాబాద్ కూడా ఇప్పుడు స్థానం సంపాదించుకోవడం జరిగింది. అర్బోర్ డే ఫౌండేషన్ అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ సంస్థలు గుర్తించినట్లు సీనియర్ స్టేట్ గవర్నమెంట్ అధికారి అరవింద్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో చెట్లు అధికంగా కలిగిన నగరంగా హైదరాబాద్ పేరు సంపాదించుకోవడం వెనకాల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి వల్ల గత రెండు సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో 3,50,56,635 మొక్కలు నాటడం జరిగింది అని స్పష్టం చేశారు. ఇక హైదరాబాదులో మొక్కలు వలన కలిగే లాభాలు కు సంబంధించిన ఫోటోలు మరియు.. ప్రపంచ సంస్థ గుర్తించిన సర్టిఫికేట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ తరుణంలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరానికి.. అత్యధిక చెట్లు కలిగిన నగరంగా పేరు రావటం పట్ల హైదరాబాద్ వాసులు కూడా సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.