జబర్దస్త్ షో లో హైపర్ ఆది టీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన టీమ్ సభ్యులతో కలిసి స్టేజీపైన అది పండించే వినోదం అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరికి పంచులు వేస్తూ అప్పుడప్పుడు జడ్జీల పై కూడా తన చతురతను ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పటి వరకూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న సుడిగాలి సుధీర్ టీం ను దాటేసి ఆది.. యూట్యూబ్ లో జబర్దస్త్ కింగ్ గా పేరొందాడు. అదే ఊపుతో ‘ఢీ’ షో కీ వెళ్ళిపోయాడు.
తెలుగు బుల్లితెర కామెడీ కింగ్ గా చెప్పబడే హైపర్ ఆది ఈమధ్య వేస్తున్న పంచులు కొంచెం మితిమీరుతున్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే టాలెంట్ ఉన్న వాడికి కాంట్రవర్సీలు ఉంటాయని అది ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఇక వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో హైపర్ ఆది జబర్దస్త్ షో పైన, ఇతర షోల పైన భారీగా సెటైర్లు వేశాడు. బిచ్చగాళ్ళ వేషం వేసిన ఆది, శాంతి స్వరూప్…. ఎంట్రీ సాంగ్ సమయంలో ఒక రేంజ్ లో పంచులు పేల్చారు.
మనలాంటి అడుక్కునే వాళ్లకు కూడా ఎంట్రీ అవసరమా అని శాంతిస్వరూప్ అడుగగా…. ఈ ప్రపంచంలో అడ్డుకోని వారు ఎవరున్నారు…? మనలని కామెడీ పెంచమని జడ్జీలు అడుక్కుంటారు. పేమెంట్ లు పెంచమని మనం అడుక్కుంటాము.. క్లోజ్ లు వేయమని అనసూయ అడుక్కుంటుంది. వేరే షో లకి రమ్మని అవతలివాళ్ళు అడుక్కుంటారు. వద్దు ఇక్కడే ఉండమని వీళ్ళు అడుక్కుంటారు. మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండి అని మనము అడ్డుకుంటామంటూ వరుస డైలాగులు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతూనే నవ్వేశారు.
జడ్జిలు కామెడీ పెంచడం, పేమెంట్లు, అనసూయ క్లోజప్ లు కామెడీ కోసం అయినా తర్వాత లైన్స్ లో మాత్రం ‘అదిరింది’ షో ని ఉద్దేశించి హైపర్ ఆది పంచులు రాసినట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే ఆది ని అక్కడికి తెచ్చేందుకు ‘అదిరింది’ యాజమాన్యం గట్టిగానే ప్రయత్నించినట్లు బయటకు వార్తలు వచ్చాయి. అందుకే ఆది అలా సెటైర్లు వేస్తున్నట్టు చెబుతున్నారు.