రవిబాబు ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు అమ్మాయి మాధవీలత సినిమాలలో కంటే ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. ఎక్కువగా న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లలో కనిపిస్తున్న ఈమె సినిమాలకు దూరమైన తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సినీ రాజకీయాల సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా మాధవీలత ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్యక్తిత్వం పై పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే…. పూరి జగన్నాథ్ ఇటీవల పోడ్ క్యాస్ట్ లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు, భావాలు, ఆలోచనలను ప్రేక్షకులతో…. సినీ అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆడవారిపై…. సమాజంలో వారు ప్రవర్తిస్తున్న తీరు పై కొన్ని కామెంట్లు చేశాడు. వీటికి నెటిజన్ల నుండి తీవ్ర స్థాయిలో నెగిటివిటీ వచ్చింది. కొంతమంది బాగుంది అన్నారు…. మరి కొంతమంది చాలా కాంట్రవర్షియల్ గా ఉంది అని తేల్చేశారు. ఈ సమయంలో మాతృస్వామ్య వ్యవస్థ, సతీసహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం అత్యాచారాలు వీటన్నింటిపై తన అభిప్రాయాలను, ఆలోచనలను ‘పూరి మ్యూజింగ్స్ లో’ షేర్ చేశాడు.
దీనిపై మాధవీలత స్పందిస్తూ…. “జగన్ నేను నిన్ను 2007లో కలిశాను. అప్పటికీ ఇప్పటికీ నీకు స్త్రీలపైన ఒకటే అభిప్రాయం. అందుకే నువ్వు నా ఫేవరెట్ పర్సన్. ఆ రోజు మీ ఇంట్లో నేను కలిసినప్పుడు కాఫీ తాగు, నూడిల్స్ తిను, కుక్కపిల్లలతో ఆడుకో…. ఏమైనా సినిమాలు చూస్తావా…. అంటూ నన్ను మీ ఇంటి పిల్లల చూసావు. ఇక ఆఫీస్ కు వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ లా,,, మధు మా ఇంట్లో అమ్మాయి అన్నట్లు చూసావు. నాకు మూవీ చాన్స్ ఇవ్వకపోయినా నేను ఫీల్ కాలేదు. నువ్వు ఎప్పటికీ ఓపెన్ మైండెడ్. అలాగే నువ్వు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి” అని పూరి ని తెగ పొగిడేసింది.