Gutka Add: విమల్ ఎలెయిచి అడ్వటైజ్మెంట్ సంస్థ టొబాకో కంపెనీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ.. బాలీవుడ్ బడా హీరోలు షారూఖ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లతో కలిసి గుట్కా యాడ్ షూట్ చేయటం తెలిసిందే. అయితే ఈ యాడ్ విషయంలో అక్షయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రజల ప్రాణాలకి హానిచేసే ప్రొడక్ట్ లని సపోర్ట్ చేయటం ఏంటి..? అంబాసిడర్ గా ఉండటం దారుణం అంటూ తీవ్రస్థాయిలో అభిమానుల నుండి బయట జనాలు నుండి.. వ్యతిరేకత వచ్చింది. దీంతో దెబ్బకు అక్షయ్ కుమార్ … ఈ యాడ్ విషయంలో అభిమానులకు అందరికీ క్షమాపణలు చెప్పి… ఇక భవిష్యత్తులో ఇటువంటి.. కంపెనీలకు ప్రచారం చేయడం జరగదని మాట ఇచ్చారు. ప్రజల
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రాణాలకు ముప్పు కలిగే ఎటువంటి ప్రోడక్టులకు ప్రచారం చెయ్యను అని విమల్ కంపెనీతో కాంట్రాక్ట్ కూడా కాన్సిల్ చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే యాడ్ విషయంలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్.. షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లపై మండిపడ్డాడు. మేటర్ లోకి వెళ్తే హౌరా నగరంలో ఉండే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిడ్జి పై మొత్తం గుట్కా ఉమ్ములే. ఈ క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్ ఈ బ్రిడ్జిపై గుట్కా తిన్ని ఉమ్ములు వేసిన వారికి బాధ్యులెవరు..? కేవలం మీ స్వలాభం మాత్రమే చూసుకుంటారా..? అంటూ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లని ట్యాగ్ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో హౌరా బ్రిడ్జి పై గుట్కాతో ఉమ్ములూ కలిగిన ఫోటోలు మొత్తం షేర్ చేయటం జరిగింది. అవన్నీష్ శరణ్ అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్ లో పెట్టిన ఈ పోస్ట్ కి భారీ ఎత్తున నెటిజన్ల నుండి రెస్పాన్స్ వస్తోంది. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి నీ చివరాకరికి గుట్కా మరకలతో నిండిపోయేలా చేశారు. గుట్కా తినే వారితో… ఈ చరిత్రాత్మక వంతెన కి ముప్పు ఉంది అంటూ ఐఏఎస్ ఆఫీసర్ బాలీవుడ్ టాప్ హీరోలపై మండిపడుతూ.. దీనంతటికీ బాధ్యులు ఎవరు అని నిలదీశాడు.