Google: దేశంలో పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పబ్లిక్ పై బాగా చూపుతోంది. ఒకప్పుడు న్యూస్ పేపర్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా.. హవా కొనసాగితే ఇప్పుడు… సోషల్ మీడియా ప్రజలను బాగా ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో ఎవరికి వారు… తమ అభిప్రాయాలను తెలియ చెప్పుకున్నే ప్లాట్ ఫామ్… అనేక రకాలుగా అందుబాటులో ఉండటంతో.. మంచి ఏంత జరుగుతుందో దేవుడెరుగు, చెడు మాత్రం చెలరేగి పోతుంది. పిల్లలు సైతం సోషల్ మీడియా వల్ల చెడ్డ దారి పట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే దేశంలో లైంగిక దాడులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు వంటివాటి విషయంలో రోజుకో వార్త వినబడుతూ ఉండటంతో.. కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గూగుల్ లో కొంత కంటెంట్ పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో గూగుల్ లో ఏది పడితే అది సెర్చ్ చేసే దిశగా కాకుండా… జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మూడు విషయాలు … దేశం లో గూగుల్ లో ఎవరైనా సెర్చ్ చేస్తే వారిని జైల్లో పెట్టడానికి రెడీ అయింది.
మొదటిది చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్, రెండవది బాంబుల తయారీ విధానం,.. మూడవది అబార్షన్ గురించి సెర్చ్ గూగుల్ లో చేస్తే భారత చట్టాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలకు కేంద్రం సిద్ధమైంది. చైల్డ్ పోర్నోగ్రఫీ కి సెర్చ్ చేస్తే పొక్సో చట్టం కింద కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుకు పంపనున్నారు. ఇక ఇదే సమయంలో బాంబు తయారీ విధానం వేదిగిన సెక్యూరిటీ సంస్థలు గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అబార్షన్ విషయంలో కూడా..సెర్చ్ చేస్తే జైలుకు.. పంపే దిశగాకేంద్రం అలర్ట్ అయింది.