Mask: మాస్క్..కొద్దికాలం కిందటి వరకు మాస్క్ వాడకం కొందరికే పరిమితం. కానీ దాదాపు ఏడాదిన్నగా అందరి జీవితంలో భాగమైపోయింది. ఇంకా చెప్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఫైన్ పడుతోంది. ప్రతీ ఒక్కరు కరోనా కట్టడిలో భాగంగామాస్క్ ధరించాలి. లేదంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కేఫ్లో మాత్రం మాస్క్ ధరిస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ వింతైన రూల్ ఇప్పుడు వైరల్ అయింది.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
అన్ని దేశాల్లో అలా…
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకోవడం సహజం అయిపోయింది. అన్ని దేశాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేసేశారు. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చినవాళ్లకు జరిమానాలు కూడా వేస్తున్నారు. అయితే, అమెరికాలో మాత్రం అందరికీ టీకాలు వేసేశామని, ఇక మాస్క్ లు అవసరం లేదని ప్రెసిడెంట్ బైడెన్ ఇదివరకే ప్రకటించారు. దీంతో మాస్క్ లు పెట్టుకున్నోళ్లకు ఫైన్ లు వేయాలన్న ఆలోచన వచ్చింది ఓ రెస్టారెంట్ యజమానికి.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
మాస్క్ పెట్టుకున్నా… టీకా గురించి చెప్పినా ఫైన్…
అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ మెండసీనోలోని ఓ రెస్టారెంట్ యజమానికి క్రిస్ క్యాజిల్ మాన్. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే 5 డాలర్లు (రూ. 364) అదనంగా బిల్లు వేస్తామని ఫిడెల్ హెడ్స్ కేఫ్లో బోర్డు పెట్టారు. టీకా గురించి డప్పుకొట్టుకుంటే మరో 5 డాలర్ల ఫైన్ వేస్తామని పేర్కొన్నారు. అయితే ఫైన్ కట్టాలా? వద్దా? అన్నది కస్టమర్ల ఇష్టమని, ఇందులో బలవంతం ఏమీ ఉండదని క్రిస్ క్యాజిల్ మాన్ వెల్లడించారు. మాస్క్ పెట్టుకోవడం తనకు పెద్దగా ఇష్టం లేదని, అందుకే ఈ కొత్త పద్ధతిని ప్రారంభించామని చెప్పారు. ఫైన్ల ద్వారా వచ్చే పైసలను తాము తీసుకోవడం లేదని, గృహ హింస బాధితులను ఆదుకునేందుకు పని చేస్తున్న ‘ప్రాజెక్ట్ శాంక్చురీ’ అనే ఎన్జీవోకు ఆ డబ్బులు ఇస్తున్నామన్నారు. ఫైన్ కట్టేందుకు కొందరు సంతోషంగా ఒప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం అసహనం ప్రదర్శిస్తున్నారని క్రిస్ తెలిపారు.