Ukraine Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం ఏ క్షణాన ఎటువైపుకి దారి తీస్తుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా చేస్తున్న దాడులు.. అక్కడ సామాన్య జనాలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల పై ప్రభుత్వ భవనాల పై… సైనిక స్థావరాలపై రష్యా బలగాలు చేస్తున్న దాడులకు.. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది.
దాదాపు నెల రోజుల పాటు జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి వస్తున్న వార్తలు ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఇక ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇండియా తటస్థ వైఖరి పట్ల.. అమెరికా సహా మిగతా చాలా దేశాలు వ్యతిరేక కామెంట్ చేయడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కి సంబంధించిన పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సు బీమ్ స్టెక్ లో పాల్గొన్న మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తూ ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకార ప్రాధాన్యత సంతరించుకుందని భావించారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీమ్ స్టెక్ ఓటమిలో ఉన్న దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం గా ఉండాలని బంగాళాఖాతం ప్రాంతం.. భద్రత వారధిగా మారాలి అని స్పష్టం చేశారు. బీమ్ స్టెక్ కూటమిలో భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మయన్మార్ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాజాగా ఈ సదస్సులో మోడీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి.