BBC Documentary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వచ్చన్ వివాదాస్పదం అయ్యింది. దీనిపై ఇటు భారత్, అటు వివిధ దేశాలు స్పందించాయి. వలసవాదుల మనస్పత్వంగా ఈ డాక్యుమెంటరీని అభివర్ణించిన భారత ప్రభుత్వం.. ఈ డాక్యుమెంటరీపై నిషేదం విధించింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీపై నిషేదం విధించినా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాలు, విద్యార్ధి సంఘాలు అక్కడకక్కడా ఉద్రిక్తతల నడుమ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. బీబీసీ డాక్యుమెంటరీని భారత్ నిషేదించడంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పత్రికా స్వేచ్చను హరించవచ్చు
తాజాగా జర్మనీ విదేశాంగ శాఖ స్పందించింది. మీడియా స్వేచ్చను హరించవద్దని పేర్కొన్నది. మీడియా, భావ ప్రకటనా స్వేచ్చ ముఖ్యమైనవని, వాటిని సమర్ధించాలని పేర్కొంది. బీబీసీ డాక్యుమెంటరీ పై నెలకొన్న వివాదంపై జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు విలేఖరుల సమావేశంలో స్పందిస్తూ భారత రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులు, స్వేచ్చను పొందుపరిచారు. వీటిల్లో మీడియా, భారప్రకటనా స్వేచ్చ కూడా ఉన్నాయి. ఈ విలువైన అంశాలను భారత్ తో జర్మనీ నిరంతరాయంగా పంచుకొంటూ చర్చిస్తున్నది అని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ కూడా బీబీసీ డాక్యుమెంటరీ నిషేదం పై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్చా పత్రికా ప్రాముఖ్యతను సమర్ధిస్తామని, భావప్రకటన స్వేచ్చ, మతం, విశ్వాసం వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను, మానవ హక్కులను ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ .. ప్రధాని మోడీని సమర్ధించారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్ హుస్సెన్ యూకే పార్లమెంట్ లో ఈ డాక్యుమెంటరీ పై చర్చను లేవనెత్తారు. ఇక్కడ ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు డాక్యుమెంటరీని సమర్ధించగా, మరి కొందరు ప్రధాని మోడీకి మద్దతు పలికారు.
నిషేదం తోసి రాజని
మరో పక్క దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్ధి సంఘాలు డాక్యుమెంటరీని బహిరంగంగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ అనుకూల విద్యార్ధి సంఘాల నిరసనల నేపథ్యంలో ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీ జెఎన్ యూ క్యాంపస్ లో విద్యార్ధి సంఘాలు డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించగా యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. 144 సెక్షన్ విధించడంతో పాటు డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు యత్నించిన 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ పలు విద్యార్ధి సంఘాలు పలు చోట్ల నిషేదిత డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
రాజ్యాంగంలోని అధికరణ 19(1 ఎ) – భావ ప్రకటన స్వేచ్చ
భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కుల అధ్యాయంలో అధికరణ 19 (1ఏ) పౌరులకు భావ ప్రకటన స్వేచ్చను ప్రసాదించింది. ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్చగా వక్రీకరించవచ్చు. మాటలు, రచనలు, ఇతర ప్రసార మాథ్యమాల ద్వార తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. తన భావాలే కాకుండా ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించే స్వేచ్చ ఉంటుంది. ఇతరుల భావాలను వ్యక్తీకరించడం మీడియా ద్వారా సాధ్యమవుతుంది. భారత రాజ్యాంగంలో ఇంత స్పష్టంగా పేర్కొనబడి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం.. బీబీసీ డాక్యుమెంటరీని నిషేదించడంపై విమర్శలు వస్తున్నాయి.
NEW
German foreign ministry speaks out on India's crackdown on BBC Modi documentary– Indian constitution enshrines fundamental rights and freedoms
– Freedom of press and speech among those
– Germany shares these values
– Discusses regularly with Indian govt pic.twitter.com/0MKQkQlqqL— Richard Walker (@rbsw) January 27, 2023
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?