మొన్న ఈ మధ్యనే పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ముష్కరులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు హతమార్చారు. వారి ఐదుగురి మరణం తర్వాత తాజాగా పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది పంజాబ్ ఫిరోజ్ పూర్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల్లో 3 ఏకే-47 తుపాకులు 2 ఎం-16 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సరిహద్దుల వద్ద సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఆయుధాలతో కూడిన బ్యాగును గుర్తించారని వెల్లడించారు. అందులో 6 మ్యాగిజైన్స్ తో కూడిన ఏకే-47; 91 రౌండ్లు 14 మ్యాగజైన్స్ తో కూడిన ఎం-16 రైఫిల్స్ తో సహా 57 రౌండ్లు ఉన్న రెండు పిస్టల్స్, 22 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. పాకిస్థాన్లో నుండి అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అంతర్జాతీయ సరిహద్దు నుండి దేశంలోకి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇలాంటి సంఘాటనలు ఈ మధ్య చాలానే ఉన్నాయి. అలాగే ఒక మందుపాతర పేలి సైనిక ఉన్నతాధికారులు తీవ్రంగా గాయపడిన ఘటన జమ్మూకాశ్మీర్లోని జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇలా వరుసగా మిలిటెంట్లు, ఉగ్రవాదులు దేశంలో చొరబడుతుంటే వారిని నిలువరించేందుకు పాక్ సైనికులు అష్టకష్టాలు పడుతున్నారు.
భారీగా దొరికిన మందు సామాగ్రి, ఆయుధాలను చూసి సరిహద్దుల్లోని సైనికులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. నాలుగు రోజుల కిందట జరిగిన మరో ఎన్కౌంటర్ లో గాయపడిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదుల్లో ఒకరి మృతదేహాన్ని భద్రత దళాలు శుక్రవారం స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో గాయపడిన ఉగ్రవాదులు నదిలోనికి దుకేయగా నౌకాధికారుల సహాయంతో పోలీసులు, సైనిక అధికారులు…. నాలుగు రోజుల పాటు వారి కోసం గాలించి ఈ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అని పోలీసు అధికారి తెలిపారు