Inida South Africa: దాదాపు మూడు నెలల పాటు ఐపీఎల్ సీజన్ జరగటంతో టీమిండియా ప్లేయర్స్ ఎవరికివారు తమ ఫ్రాంచైజీ టీంతో కీలకంగా రాణించారు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో కొత్త టీంలు కూడా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ యే టైటిల్ గెలవడం జరిగింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కప్పు గెలవడంతో… మనోడి పేరు మారుమోగుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో T20 సీరీస్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో టీం ఇండియా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే ఈ సిరీస్ లో ప్రపంచ రికార్డుపై టీమ్ ఇండియా కన్నేసింది. పూర్తి విషయంలోకి వెళ్తే జూన్ 9వ తారీకు నుండి జరగబోయే ఐదు t20 సీరిస్ మ్యాచుల్లో.. మొదటిది ఢిల్లీలో జరగనుంది.
అయితే ఢిల్లీలో జరగబోయే మ్యాచ్ లో విజయం సాధిస్తే T20 లో అత్యధికంగా వరుసపెట్టి మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డ్ ఇండియా సృష్టించనుంది. ఇండియా ఇప్పటి వరకు వరుసగా 12 T20 మ్యాచ్ లు గెలిచి ఆఫ్ఘనిస్తాన్, రొమానియా తో సమానంగా నిలిచింది. దీంతో ఢిల్లీలో జరగబోయే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టి20 మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇండియా ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని టీమిండియా సభ్యులు భారీ ఎత్తున ప్రణాళికలు వేస్తున్నారు.