IPL 2021: ఐపీఎల్ 20 21 సీజన్లో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య ఈ రోజు రాత్రి 7: 30 గంటలకు మా బాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. కోల్కతా లోని ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది.. దీంతో ఈ రోజు మ్యాచ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వాయిదా వేసింది..
కోల్కతా నైట్ రైడర్స్ జుట్టులోని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ Varun Chakaravarthy , Sandeep Warrier కి తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది.. ఈ ఇద్దరి ఆటగాళ్లలో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించగానే వెంటనే శాంపిల్స్ సేకరించి నిర్వహించారు. ఇందులో పాజిటివ్ గా ఉంది. దాంతో టీమ్ లోని ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే బిసిసిఐ ఆటగాళ్ల కోసం కఠినమైన బయో సెక్యూర్ బబుల్ ని క్రియేట్ చేసింది. ఏడు రోజుల క్వారంటైన్, మూడుసార్లు కరోనా వైరస్ పరీక్షల తర్వాతే.. ఆటగాళ్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ బబుల్ లోకి ఎంట్రీ లభించింది. అలానే మ్యాచ్ అధికారులు, కామెంటేటర్ లు బ్రాడ్కాస్టర్ లు ఈ బబుల్ లో ఉన్నారు.
https://twitter.com/IPL/status/1389122711113277446?s=19