‘ఎనర్జిటిక్ స్టార్’, ‘చాక్లెట్ బాయ్’ గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ తనకు సంబంధం లేని విషయంలో చేసిన ట్వీట్లే ఇప్పుడు అతడికి ఇండస్ట్రీలోనూ…. ఇటు రాజకీయంగానూ కొత్త శత్రువులను తెచ్చిపెట్టాయి. సాధారణంగా టాలీవుడ్ ఇండస్త్రీలో సింహ భాగం అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఒక పేరు ఉండేది. అది తమలో ఒకడు ఏKఅంగా రాష్ట్ర సీఎం కావడం వల్ల వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ ముద్ర అలాగే పడిపోయింది. ఇక తాజా ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇదంతా హీరో రామ్ పట్టించుకోలేదో ఏమో కానీ తన బంధువు అయిన విజయవాడ రమేష్ హాస్పిటల్ అధినేత రమేష్ కు మద్దతుగా రామ్ ఓ ట్వీట్ వేశాడు.
వివరాల్లోకి వెళితే రమేష్ ఆస్పత్రులకు అనుబంధంగా నడుస్తున్న స్వర్ణ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి పది మంది మరణించారు. దీనిలో రమేష్ ఆస్పత్రి వైఫల్యం ఎంతైనా ఉంది. దీనిపై విచారణ చేసేందుకు రమేష్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్న దశలో అతను కాస్త పరారీలో ఉన్నాడు. రమేష్ హాస్పిటల్స్ వారు స్వర్ణ లాష్జిని కోవిడ్ సెంటర్ గా మార్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోలేదన్న క్రమంలో ప్రమాద ఘటనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రామ్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేశాడు. జగన్ మోహన్ రెడ్డిని టాగ్ చేసి “మీ వెనక కుట్ర జరుగుతోందని కాస్త గమనించండి” అంటూ పోస్ట్ చేశాడు. ఇక పరిస్థితి బాగా అదుపు తప్పుతోంది అని అనుకున్న నేపథ్యంలో రామ్ కాస్త వెనక్కు తగ్గినా కూడా సోషల్ మీడియాలో అతనిని పలువురు ట్రోల్ చేస్తున్నారు.
ఇదే ఇదే సమయంలో రామ్ చంద్రబాబు కి మద్దతుగా మాట్లాడటం కూడా రామ్ కె మైనస్ అయ్యింది. దానితో పాటు వైసిపి వాళ్లు కూడా అతనిని టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే రామ్ ని ఓ రేంజ్ లో ఉతికి ఆరేశారు. అసలు సినిమా హీరో పైన కులం ముద్ర పడడం చాలా చేటు. “అలాంటిది నీ సినిమాలని కమ్మ వారు మాత్రమే చూస్తే చాలా?” అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో కూడా రామ్ వ్యవహరించిన తీరు సరిగా లేదని అందరూ టార్గెట్ చేసి గుసగుసలాడుతున్నారు. మరి ఈ ఎఫెక్ట్ అతని కెరీర్ పై పడుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం అతను ఎవరు కావాలంటే వారు విమర్శించుకునే ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు.