Israel: ఇజ్రాయిల్ ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ తెలిసిన తర్వాత తొలిసారి ఇండియాలో పర్యటించడానికి రెడీ అయ్యారు. వచ్చే నెల రెండో తారీఖున భారత్ లో పర్యటించనున్నారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇంకా సైబర్ సెక్యూరిటీ వాతావరణ మార్పు మరియు వ్యవసాయం పలు రంగాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో.. చర్చించనున్నరు. అందుకే దేశాలకు సంబంధించి దౌత్య సంబంధాల స్థాపనకు 30 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో ఏప్రిల్ మొదటి వారంలో నఫ్తాలీ బెన్నెట్ పర్యటిస్తున్నట్లు ఇజ్రాయిల్ అధికారులు స్పష్టం చేశారు.
ఆసియాలోనే ఇజ్రాయిల్.. భారత్ అత్యంత నమ్మకమైన.. స్నేహపూరితంగా ఉండే దేశాలు. ఈ రెండు దేశాలు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడంలో కీలకంగా రాణిస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ఇజ్రాయిల్ ప్రధాని పర్యటన లో కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా భారత్ పర్యటన ఉద్దేశించి తాజాగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ మాట్లాడుతూ నా స్నేహితుడు ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారతదేశానికి.. నా మొదటి అధికారిక పర్యటన చేపట్టడం నేను చాలా సంతోషంగా మరియు ఆసక్తికరంగా ఉన్నాను అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా భారతీయ సంస్కృతి మరియు యుదు సంస్కృతి ఇ మధ్య సంబంధం చాలా లోతైనది.. భారతీయుల నుండి ఉన్న విషయాలు నేర్చుకోవచ్చు అంటూ నఫ్తాలీ బెన్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఇజ్రాయిల్ ప్రధాని ఈ పర్యటన చేపట్టనున్నట్లూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక ఇండియాలో ఉన్న స్థానిక యూదుల సమాజానికి చెందిన వాళ్ళని కూడా ఇజ్రాయిల్ ప్రధాని కలుసుకోనున్నారు అని కూడా అంటున్నారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో గ్లాస్గో లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో ఫస్ట్ టైం రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిశారు. ఆ సమయంలోనే మోడీ…. నఫ్తాలీ బెన్నెట్ నీ ఆహ్వానించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని మీడియా సలహాదారు స్పష్టం చేశారు.