ఈటీవీలో ‘జబర్దస్త్‘ వచ్చి ఏడేళ్ళు అవుతుంది. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ అని దీనిలోనే కొంతమంది కంటెస్టెంట్స్ ను పెట్టి రెండవ భాగాన్ని మొదలుపెట్టారే తప్ప మల్లెమాల ప్రొడక్షన్స్ వారు ఈ షో మొదలైనప్పటి నుండి ఈరోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా ఇన్ని సంవత్సరాలు టెలివిజన్ చరిత్రలో ఏకధాటిగా కొనసాగిన కామెడీ షో ఇదేనేమో.
ఎన్ని కార్యక్రమాలు వచ్చినా…. దీని ముందు బలాదూర్. టిఆర్పి రేటింగ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త స్థాయిని అందుకుంటూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది ఈ కామెడీ షో. జబర్దస్త్ నుండి బుల్లితెర ప్రేక్షకులకు వస్తున్న వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త స్కిట్లతో, మంచి ఎడిటింగ్, టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తో సమానంగా జడ్జిలతో మెరిసిపోతున్న జబర్దస్త్ కి గడ్డుకాలం మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ హీట్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. ఒక వైపు చూస్తే బిగ్ బాస్ సీజన్ ఫోర్.. మరోవైపు ఆరునెలలపాటు క్రికెట్ రుచి తెలియని అభిమానులకు భారీ ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్, బిగ్ బాస్ లాంటి రెండు పెద్ద ఈవెంట్ ల రాకతో జబర్దస్త్ ఎక్కడలేని కష్టాలు వచ్చేసాయి. బిగ్బాస్ మొదలుకాగానే జబర్దస్త్ రేటింగ్ కొద్దిగా తగ్గింది. అయితే ఐపీఎల్ ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో వెంటనే ఈ కామెడీ షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
ఇక బిగ్ బాస్, ఐపీఎల్ లను తట్టుకుని నిలబడాలంటే యాజమాన్యం కొత్త మార్గాలు అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. అందుకే టీం లీడర్స్ కు ఎక్స్ట్రా టాస్క్ లు ఇచ్చారట. కాంట్రవర్సీలు ఉనా పరవాలేదని స్కిట్లు మాత్రం అద్దిరిపోవాలని… అలా ప్రోమో లు కట్ చేసి ప్రేక్షకులు కచ్చితంగా చేసేందుకు ఎపిసోడ్ చూసేందుకు జబర్దస్త్ టీం తెగ ప్రయత్నాలు చేస్తుందట. అందులో భాగంగానే రాకేష్ మాస్టర్ శిష్యుడు పుల్లయ్య, యాంకర్ రవి, రోహిణి, ఆషు రెడ్డి లు షో లోకి వచ్చినట్లు సమాచారం. మరి వీరి ప్రయత్నాలు సఫలం అవుతాయానే లేదో వేచి చూద్దాం.