రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరొక మేజర్ ట్విస్టు చోటుచేసుకుంది. జగన్ సర్కారు హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నుండి ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…. హైకోర్టు తీర్పు అమలు పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీం కోర్టు వారిని కోరింది. ఇకపోతే నిమ్మగడ్డ రమేష్, జస్టిస్ కనగరాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల కమిషన్ కార్యదర్శులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అయితే ఇక్కడ జగన్ సర్కారు క్రితం సారి హైకోర్టులో జరిగిన తప్పుని పునరావృతం చేయకుండా ఈసారి సుప్రీంకోర్టు లోనే అత్యంత పేరు మోసిన లాయర్ తో ఈ కేసును నడిపించనున్నారని సమాచారం బయటకు వచ్చింది. ప్రత్యేకంగా ప్రభుత్వానికి మరియు రాజ్యాంగపరమైన ఇబ్బందులను డీల్ చేసే విషయంలో ఈ లాయర్ ను కొట్టేవారు దేశంలోనే లేరని బయట టాక్ నడుస్తోంది. ఇకపోతే ఆ లాయర్ సలహాలు మేరకు జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు కూడా జరిపినట్లు అధికార పార్టీ వర్గాల నుండి న్యూస్ బయటకు పొక్కింది.
వివరాల్లోకి వెళితే పిటిషన్ లో ఎన్నికల కమిషన్ నియామకం గవర్నర్ విచక్షణ మేరకు ఉంటుందని…. హైకోర్టు మాత్రం ఇందులో పొరపాటు పడిందని ప్రభుత్వం వారు పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ రాజ్యాంగ అధికారులను, కేబినెట్ సలహా సిఫారసుల మేరకు ఉపయోగిస్తారని పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు అధికరణం 243 కె, 243 జెడ్.ఎ ల ప్రకారం పదవీకాలాన్ని…. సర్వీస్ నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైకోర్టు గుర్తించలేదని…. అందుకే హఒ కోఱ్తు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని మరియు హైకోర్టు కు ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ సిఫార్సు మేరకే మొదటి నియమితులయ్యారు కాబట్టి హైకోర్టు ద్వారా తన నియామకం చెల్లదని పేర్కొంది.
ఇటువంటి అతి ముఖ్యమైన పాయింట్లను పొందుపరిచిన జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టు వారి నుండి సానుకూల సమాధానం కోసం వేచి ఉంది. ఇకపోతే వారు నియమించుకున్న లాయర్ ఎంతటి ప్రభావం కనబరుస్తాడు అన్నది వేచి చూడాలి. ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో అనే విషయంపై రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.