ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహనంగా తన అవకాశం కోసం ఎదురు చూసి తీరికగా ప్రత్యర్థులను దెబ్బకొట్టే స్వభావం గలవాడు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థులను మట్టికరిపించి ముందుకు పోతున్నాడు. ఇక తన రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్న జగన్ వారి పై చాలా స్పష్టంగా పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు టీడీపీకి దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలబడుతూ వస్తుంది కమ్మ సామాజిక వర్గం లో చీలిక తెచ్చే విధంగా జగన్ ఇప్పుడు ప్రయత్నాలు షురూ చేశారు.
టిడిపికి కమ్మ సామాజిక వర్గం ఎప్పటినుంచో అండగా వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలన్న జగన్ ఆ ఆలోచన లో భాగంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఒక జిల్లాగా అవతరించినుండగా… కృష్ణా జిల్లాకు అదేసమయంలో ఎన్టీఆర్ జిల్లా అన్న పేరుని ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో మొత్తం ప్రజాసంక్షేమ విషయాలపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు ఆ బిజీ నుండి బయటపడి జిల్లాల పెంపు ప్రక్రియను మొదలుపెట్టారు.
అంతేకాకుండా ఆయన ఒక అడుగు ముందుకు వేసి కృష్ణా జిల్లాను రెండుగా విభజించి ఒకదానికి ఎన్టీఆర్ పేరును మరొకదానికి పింగళి వెంకయ్య పేరుని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే కనుక జరిగితే కమ్మ గడ్డగా చెప్పబడే కృష్ణ జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో జగన్ టిడిపిని చావుదెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇప్పటికే చాలా మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారు తమ బేస్ ను వైసీపీకి షిఫ్ట్ చేశారు. ఇక మిగిలిన వారిని కూడా తనవైపు తిప్పుకొని టిడిపిని ఒంటరి పక్షిని చేయాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.