Jagananna Vasathi Deevena: జగనన్న నవరత్నాలు లో భాగంగా “జగనన్న వసతి దీవెన” పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 11 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ పథకం ద్వారా నగదు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా సీఎం జగన్ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనున్నారు..
ఈ పథకం ద్వారా విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. పథకంతో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఐటిఐ విద్యార్థులకు 10000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15000, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే వారికి 20000 చొప్పున అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. గత వారమే విద్యాదీవెన మొదటి త్రైమాసికం డబ్బులను జమ చేసింది.