Weight Loss: నేటి జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య అధిక బరువు.. ఒక్కసారి ఎవరైనా బరువు పెరిగావూ అని మాట వరసకు అన్నా చాలా మంది వెంటనే చేసే పని అన్నం తినకుండా మానేస్తారు.. లేదంటే ఉదయం టిఫిన్ తినక పోవడం, రాత్రి చపాతీ తినడం, వేడి నీళ్లు తాగటం.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇలా తిండి తినకపోతే అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నాట్టే.. మరి కొంతమంది జిమ్ సెంటర్ కి వెళ్తున్నారు.. అయితే మన ఇంట్లో లభించే అరటి పండు తో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు జపనీస్ మెడిసిన్ ఫార్మసిస్ట్ సుమితో వతనబ్..!! ఆమె స్వయంగా తన భర్త కోసం ఈ వైద్యాన్ని కనిపెట్టారు..!!
సుమితో వతనబే వృత్తి రీత్యా చైనీస్ మెడిసిన్ ఫార్మసిస్ట్.. తన భర్త హితోషి వతనబే బాగా బరువు పెరగటం తో ఆమె ఈ చిట్కా కనుకున్నారు. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటి పండు టిఫిన్ లా తినాలి. రాత్రి భోజనం తర్వాత ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం.. సుమారు 10 నుంచి 12 గంటల తర్వాత తీసుకునే అల్పాహారం ప్రోటీన్ ను కలిగి ఉండాలి.. మంచి అల్పాహారం తీసుకోవడం వలన రోజంతా ఆక్టివ్ గా ఉంటారు.. బరువు తగ్గాలి అనుకునే వారు తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. లేదంటే పొట్టలో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అయితే అరటి పండు బరువు తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే.. అరటి పండు లో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.. పోటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి.. అరటి పండు లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా ఎక్కువ సేపు ఆకలి అనిపించదు.. చిరుతిళ్లు జోలికి పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఒక అరటి పండు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.. ఇలా తాగితే సులువుగా బరువు తగ్గుతారు.. పైగా మీ కడుపు మడ్చుకొనవసరం లేదు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ జపనీస్ టెక్నిక్ ను ట్రై చేయండి.. ఈ టెక్నిక్ తో హితోషి వతనబే కేవలం ఆరు నెలలలో 11 కేజీలు బరువు తగ్గారు.. ఇప్పుడు జపనీస్ అంతా ఈ టెక్నిక్ నే ఫాలో అవుతున్నారు.. అలాగే అరటి పండు తో బరువు తగ్గడానికి హితోషి వతనబే రచించిన Mornib Banana Regimen పుస్తకం చాలా పాపులర్ అయ్యింది..