Jetti Movie: భారతదేశంలో మొదటి సారిగా హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం జెట్టీ.. నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ నూతన కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు.. తాజాగా సినిమా లోని మొదటి పాట “దూరం కరిగినా.. మౌనం కరుగునా”.. పాటలు వేణు ఉడుగుల రిలీజ్ చేశారు. శ్రీమణి గారు రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు.

ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దక్షిణ భారతదేశంలోనే సరికొత్త సముద్రపు కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు తెరపై ఇంతవరకు చూడని మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వేణు ఉడుగుల విడుదల చేసేలా ఈ సినిమా పాట కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. ఈ కథ నేను విన్నాను, చాలా బాగుంది, ఖచ్చితంగా విజయం అవ్వాలని ఆశిస్తున్నాను అంటూ వేణు ఉడుగుల చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా మొత్తం నాలుగు భాషల్లో విడుదల కానుంది.