Jhanvi kapoor: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి పేరు తెలియని వారుండరు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు తిరుగులేని క్రేజ్ శ్రీదేవి సొంతం. తెలుగు సినిమా రంగంలో అయితే ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి జనరేషన్ వరకు చాలావరకు స్టార్ హీరోలందరి పక్కన నటించింది. డాన్స్ పరంగా ఇంకా నటన పరంగా.. తిరుగులేని పెర్ఫార్మెన్స్ తో.. స్క్రీన్ మీద చెలరేగిపోయే శ్రీదేవి… బోనీకపూర్ తో పెళ్లయ్యాక సినిమాలు ఆపేయడం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ప్రమాదవశాత్తు దుబాయ్ లో బాత్రూం లో జారిపడి తలకు బలంగా దెబ్బ తగిలి శ్రీదేవి మరణించడం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీదేవి బతుకున్న సమయంలోనే పెద్ద కూతురు ఝాన్వి కపూర్ నీ సినిమా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని రంగం సిద్ధం చేయగా.. కూతురు ఫస్ట్ సినిమా విడుదల అవ్వక ముందే శ్రీదేవి మరణించడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదంగా మిగిలింది. శ్రీదేవి నటవారసురాలిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్… తనదైన శైలిలో రాణిస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్నాళ్లకు ముందు ఓ ప్రముఖ షోలో శ్రీదేవి చీఫ్ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు అదే షోలో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
పూర్తి విషయంలోకి వెళ్తే భారత్ మాజీ క్రికెటర్ ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు గంగూలి హోస్ట్ గా చేస్తున్న రియాల్టీ షో దాదాగిరి. 2009వ సంవత్సరం నుండి ఓ బెంగాలీ ఛానల్ లో ఈ రియాల్టీ షో ప్రసారమవుతోంది. గతంలో ఈ షోకి “మామ్” మూవీ ప్రమోషన్ లో భాగంగా.. శ్రీదేవి రావడం జరిగింది. అయితే మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కూతురు ఝాన్వి కపూర్.. సౌరవ్ గంగూలీ దాదా గిరి రియాల్టీ షోలో లేటెస్ట్ గా సందడి చేసింది. ఈ షోలో గంగూలి.. జాన్వీ కపూర్ నీ ఆమె తల్లి గురించి అనేక విషయాలు.. అడిగి తెలుసుకోవడం జరిగింది. తల్లి అడుగు పెట్టిన షో లోకి కూతురు ఝాన్వి కపూర్ రావడంతో.. ఈ వార్త బాలీవుడ్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.