భారతదేశంలోనే అతిపెద్ద డేటా లీక్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పది కోట్ల మంది వినియోగదారుల యొక్క గోప్యమైన వివరాలు ‘జస్ పే’ సర్వర్ నుండి బయటకు లీక్ అయినట్లు చెబుతున్నారు. ఇక ఈ డేటా లో వినియోగదారుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను డార్క్ వెబ్ ద్వారా లీక్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘డేటా డంప్’ రూపంలో ఇవి బయటకు లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు.
జస్ పే పేమెంట్స్ యాప్ నుండి ఒక సర్వర్ ద్వారా ఈ లీక్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక ఇదే కనుక నిజమైతే… భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద డేటా లీక్ ఇదే అవుతుంది. దేశ జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మంది వివరాలు ఇలా లీక్ అయ్యాయి అంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చు. జస్ పే వారి బెంగళూరు హెడ్క్వార్టర్స్ లోని ఒక సర్వర్ నుండి ఈ లీక్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఇక ఈ లీక్ లో వినియోగదారుడి కార్డ్ బ్రాండ్ విసా లేదా మాస్టర్ కార్డ్, దానిపై ఉండే పేరు, కార్డ్ ఫింగర్ ప్రింట్, కార్డ్ ఐ ఎస్ ఐ ఎన్, కస్టమర్ ఐడి, మర్చంట్ అకౌంట్ ఐడి ఇంకా ఇతర వివరాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక రెండు కోట్ల వినియోగదారులకు సంబంధించి 16 అంశాల్లోని డేటా అయినట్లు అనుమానాలు వస్తున్నాయి. వీటితో పాటు కార్డు నెంబరు లోని చివరి నాలుగు అంకెలు, వెనకాల ఉండే గొప్యమైన సివివి వంటి వివరాలు కూడా లీక్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అధికారులు దీనిని మరింత లోతుగా విచారిస్తున్నారు.