Viswanadh: దివంగత దర్శకుడు కళాతపస్వీకే విశ్వనాధ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.. యావత్ సినీ లోకం శోకసంబంధం మునిగిపోయింది ఆ బాధ నుంచి బయటపడుతుండగానే మరో విషాద వార్త మళ్ళీ కంటతడి పెట్టేస్తోంది.. కళాతపస్వి కన్ను మూసి నెల రోజులైనా గడవకముందే ఆయన భార్య జయలక్ష్మి గుండెపోటుతో మరణించారు..
కళాత్మక సినిమాలతో తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటినా కే విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి పెట్టిన 22 రోజులకి ఆయన భార్య కూడా మరణించడం.. వారి కుటుంబ సభ్యులను, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఆవిడ వయసు 86 ఏళ్లు కాగా.. ఆదివారం అస్వస్థతకు గురువు కావడంతో కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా అక్కడ ఆమె చికిత్స పొందుతూనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కళాతపస్వి మరణించిన 22 రోజులకే మన భార్య మరణించడం బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.