బాలీవుడ్ విలక్షణ దర్శకులలో ఒకరైన అనురాగ్ కశ్యప్ పై అందాల కథానాయిక పాయల్ ఘోష్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. “నాకు ఫోన్ కాల్ దూరంలో కథానాయకులు ఉన్నారు…. నన్ను నమ్మితే ఆఫర్లే ఆఫర్లు అంటూ గదిలో తనతో గడుసుగా ప్రవర్తించాడు” అంటూ పాయల్.. అనురాగ్ లాంటి స్టార్ డైరెక్టర్ పై ఆరోపించడం ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద సంచలనం రేపుతోంది.
దీనిపై తాజాగా అనురాగ్ స్పందిస్తూ కంగనా రనౌత్ పాయల్ ఘోష్ ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తోందని పరోక్షంగా అనురాగ్ ఆరోపించారు. ఒక ఇంటర్వ్యూలో దర్శకనిర్మాత తనను బలవంతం చేయడానికి ప్రయత్నించారని పాయల్ పేర్కొంది. అయితే అనురాగ్ నేరుగా కంగనా పేరు పెట్టకపోయినా బచ్చన్ కుటుంబాన్ని తెరమీదకు తీసుకురావడంతో పాటు కంగనా కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక మహిళ (కంగనా అయి ఉండొచ్చు) ఇతర మహిళలు (పాయల్) తనపై ఆరోపణలు చేస్తున్నారని…. ఈ గొడవలోకి లాగారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనురాగ్ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.
హిందీలో వ్యాఖ్యానిస్తూ…. “మీరు నన్ను చాలా కాలం సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు. సమస్య లేదు నన్ను నిశ్శబ్దంగా ఉంచేందుకు మీరు చాలా అబద్దాలు చెబుతూనే ఉన్నారు. ఇతరులు కూడా ఈ అబద్ధం లో చిక్కుకున్నారు…. మేడం నేను చెప్పదలుచుకున్నది నా పై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవవి అని” అంటూ ‘ఆధారం’ అన్న పాయింట్ ని వాడారు.
ఇటీవల కంగనా యోధురాలు అన్న వ్యాఖ్యలపై అనురాగ్ కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. తను యోధురాలు అయితే నలుగురు గ్యాంగ్ ని తీసుకెళ్లి చైనాతో యుద్ధం చేయమని కోరారు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో చేరమని కంగనా అనురాగ్ కు కౌంటర్ వేసిందు. అతను తెలివి తక్కువ వాడు అని చెప్పింది. ఆ గొడవ తర్వాత పాయల్ వేధింపుల ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఇక మరొక ట్వీట్ లో అనురాగ్…. “నాపై ఆరోపిస్తూ నా నటులను (తాప్సీ పన్ను)…. బచ్చన్ కుటుంబాన్ని ఈ గొడవల్లోకి లాగుతున్నారు” అంటూ అనురాగ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.