Cheating : ప్రార్థనల కోసం భక్తితో చర్చికి వెళ్లిన ఒక యువతిని ఓ పాస్టర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ఇలాంటివి రోజూ ఎక్కడో ఒకచోట జరిగేదే అయినా ఈ ఘటన ఇంత హైలెట్ ఎందుకు అయిందంటే సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి యువతికి అండగా ఉండడం వల్ల అనే చెప్పాలి.
వివారాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఒక యువతి ఆల్కాట్ తోట సమీపంలోని ప్రార్థన మందిరానికి వెళ్ళేది. ఆ మందిరంలోని పాస్టర్ ఆ యువతితో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు అని యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఇక అతనిని నమ్మి మనస్సు తో పాటు శరీరాన్ని కూడా అర్పిస్తే కొంతకాలంగా అతను మొహం చాటేయడం జరిగిందట.
ఇక అతను ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో నేరుగా చర్చికి వెళ్లి పాస్టర్ ని నిలదీస్తే అతను ఆమెకి షాక్ ఇచ్చాడు. నన్ను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తే ఆమె వీడియోలు తో బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. అలాగే తనను చంపేస్తానంటూ కూడా బెదిరింపులకి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఆమెకు తండ్రి లేదు… అందుకే పాస్టర్ బెదిరింపులకు భయపడి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిసింది.
హైదరాబాద్ లో సదరు యువతి సినీ అర్టిస్టు, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి ని కలిసిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా కళ్యాణి రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడింది. తొలుత ఆమెకి ధైర్యం చెప్పి షీ–టీమ్ ను సంప్రదించమని సూచించినట్లు చెప్పిన కరాటే కళ్యాణి… ఆ యువతిని తీసుకొని వచ్చి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించింది. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని చెప్పిన ఆమె ఆ పాస్టర్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.