KCR: తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌణ్ అమలు జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపైతలెంగాణ సీఎం కేసీఆర్ అప్సెట్ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ సరిగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో నేటి నుంచి లాక్ డౌన్ అమలు రూల్స్ మారనున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ లో ఉగ్రరూపం…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసుల పరిస్థితి, వైద్య సేవలు, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగడం లేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంటూ గ్రామాల్లో సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని పేర్కొంటూ ఇదే రీతిలో నగరాలు , పట్టణాల్లో లాక్ డౌన్ మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
వాళ్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలి
కరోనా కట్టడి విషయంలో ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు, పాస్ లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. దీంతో ఈ రోజు నుంచి లాక్ డౌన్ అమలు విషయంలో మరింత కఠినంగా పోలీసులు వ్యవహరించవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.