KCR: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయానికి మోక్షం తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవాక్కయేలా చేసిందని అంటున్నారు. పీసీసీ పదవుల పందేరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నేతలకు ఊహించని ప్రాధాన్యం కల్పించడం వెనుక లెక్కలు వేరేనని అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు నేతలకు చాన్స్ ఇవ్వడంలో సమీకరణాలు వేరే ఉన్నాయని చెప్తున్నారు.
Read More: KCR: కేసీఆర్ బీపీ పెంచేస్తున్న ఇద్దరు ముఖ్యులు ఎవరంటే…
కేసీఆర్ సొంత జిల్లాకు…
తాజాగా ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ను, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను పీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్గా నియమించారు. ఒకే జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ సీనియర్లకు పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ సొంత జిల్లాపై తాము ఫోకస్ పెట్టినట్లు కాంగ్రెస్ సందేశం ఇచ్చిందంటున్నారు.
Read More: Revanth Reddy: ఇప్పుడుంటుంది అసలు మజా… పీసీసీ రథసారథిగా రేవంత్!
ఆయన మాత్రం ఖుష్
ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ నియామక పక్రియ సమయంలో తనకు చాన్స్ ఇవ్వడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి వద్దని వ్యతిరేకించిన ఆయన పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే, తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కడంతో జగ్గారెడ్డి ఖుష్లోనే ఉన్నట్లు చెప్తున్నారు. నలుగురు సీనియర్లకు పదవులు ఇవ్వడం, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం అనే సందేశాన్ని పంపిందంటున్నారు.