KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తుంటే మరోవైపు ఇక్కడ పరిస్థితులు ఇంకో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వం పట్ల తమ నిరసనను తెలియజేయడంలో భాగంగా హుజురాబాద్లో తాము పోటీ చేస్తామంటూ 1000 మంది ఫీల్ట్ అసిస్టెంట్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించిన కారణంగానే వారు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ప్రైవేటు టీచర్లు సైతం వారి పోటీకి సిద్ధమన్నారు. దీంతో పాటుగా ఎంపీటీసీలు సైతం బరిలో నిలుస్తున్నారు.
Read More : KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
భారీ షాక్…
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 100 మంది ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేయనున్నట్లు తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు టీచర్లకు రూ. 2000 నగదు, రేషన్ బియ్యం సహాయం అందించి ప్రైవేట్ అధ్యాపకులకు మాత్రం మొండి చేయి చూపించి సర్కార్ అన్యాయం చేసిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ ఆరోపించారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
Read More : KCR: హుజురాబాద్లో కేసీఆర్ కొత్త ఆపరేషన్ ఏంటో తెలుసా?
టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం…
తెలంగాణ రాష్ట్ర సమితి హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు అన్ని రకాలైన ఎత్తుడలు వేస్తూ గెలుపు కోసం కృషి చేస్తోంది. ఇటు అధికారం అటు విధానపరమైన నిర్ణయాల పరంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే, సర్కారుకు మాత్రం ఇలా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడం కొత్త చర్చకు దారితీస్తోంది.