KCR: జానపద కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోటి రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ లో ఇల్లు మంజూరు చేయటం తెలిసిందే. అయితే ఈ ప్రకటన చేసి చాలా నెలలు కావస్తున్న గాని కిన్నెర మొగిలయ్యకు.. టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి మొన్నటి వరకు చేకూరలేదు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ పట్ల వీడియో రూపంలో ఆయనతోనే మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పై మండి పడటం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేవలం హామీలకు మాత్రమే అన్న తరహాలో విమర్శలు చేయగా… ఆ సమయంలో కిన్నెర మొగిలయ్య కూడా కొద్దిగా బిజెపికి ఫేవర్ గా మాట్లాడటం జరిగింది. అనంతరం ఆ వీడియో తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అయిన సమయంలో… దయచేసి పేదవాడిని నా పొట్ట కోట్ట వద్దు అని కిన్నెర మొగిలయ్య అప్పట్లో బతిమాలు కోవడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా కిన్నెర మొగిలయ్యకు గతంలో కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీటికీ కీలక ఉత్తర్వులు టిఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. కిన్నెర మొగిలయ్య కోరినట్లుగానే బి.యన్ రెడ్డి నగర్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కూడా కేటాయించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
గత ఏడాది మార్చి నెలలో దర్శనం మొగులయ్యకి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందజేయడం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ సమయంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కిన్నెర మొగిలయ్య కలవడం జరిగింది. ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం.. కోటి రూపాయల నగదుతో పాటు నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.