KCR: తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు పడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. హుజురాబాద్ లో తిరుగులేని నేతగా దాదాపు 2 దశబ్దాల పాటుగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా నేతపై కేసీఆర్ సీరియస్గా దృష్టి సారించినట్లు సమాచారం.
Read More: Eatela Rajendar: ఈటల విషయంలో కేసీఆర్ ఎక్కువ పరేషాన్ అవుతున్నది ఎందుకంటే…
ఈటల విషయంలో వ్యూహాత్మకంగా…
ఈటల రాజేందర్ ది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కావడం. ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం, కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు సరన నిలబడిన నేతగా ఎదగడంతో అంతటి లీడర్ ను ఢీ కొట్టాలంటే ఎవరైతే సరిపోతారన్న విషయంలో ఇంకా కన్ క్లూజన్ కు రాలేకపోతున్నారు. బీసీలో బలమైన నేతగా పేరున్న ఈటల రాజేందర్ ను ఢీకొట్టాలంటే మరో బీసీ నేతను రంగంలోకి దించాలన్న ప్రయత్నాలను గులాబీ పార్టీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఓ నాయకురాలి విషయంలో కేసీఆర్ సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Read More: Eatela Rajendar: కొత్త గేమ్ మొదలుపెట్టిన ఈటల… వర్కవుట్ అవుతుందా?
ఆమె పేరును పరిశీలిస్తూ…
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ అనే లెక్కతో పాటుగా నియోజకవర్గంలోని ఓట్లను సైతం దృష్టిలో ఉంచుకొని ఈ నేత పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం…