Keerthi Suresh : తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి సురేష్.. మహానటి సినిమా తో తెలుగులో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.. తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. “గుడ్ లక్ సఖి” సినిమాను 2021 జూన్ 3న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్..
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువగా మహిళలు పనిచేస్తున్నారట. ఈ మూవీకి శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. గ్రామీణ ప్రాంతం నుంచి యువతి ఎలా షూటింగ్ లో పాల్గొని పతకాలు గెలుచుకుంటుందనేది ఈ సినిమా స్టోరీ.. ఈ చిత్రాని కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.