Kerala Doctors: కరోనా వైరస్ పోరులో వైద్యుల పాత్ర ముఖ్యమైనది.. వారి సేవలు కొనియాడదగినది. కోవిడ్ బారిన పడిన లక్షలాది మందిని వారు నిరంతరం కాపాడుతున్నారు.. కానీ కేరళ వైద్యులు మాత్రం సాహసయాత్ర చేసి మరి కోవిడ్ బాధితులకు సేవలు అందించారు.. కేరళ వైద్య బృందం నదులు, అడవులు దాటుకొని వెళ్లి సేవలందించినందుకు కేరళ ప్రభుత్వం వారి సేవలను అభినందించింది..
Read More: పేర్లు ఉండవు.. విజిల్ వేసి పిలవాలి.. ఇదో వెరైటీ ఊరు..!!
కేరళలోని డామిసిలియరీ కు మురుగుల అనే మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు వైద్య సిబ్బంది బయల్దేరారు. వైద్య సిబ్బంది నదులను దాటుకొని, అడవిలో ఎనిమిది కిలోమీటర్లు నడిచి మురుగుల గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామంలో వంద మంది నివసిస్తారు. కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని వైద్య సిబ్బంది వారి వద్దకు వెళ్లారు. అక్కడ 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురు కి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరందరినీ వైద్యులు పుథూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం చేసిన సాహసయాత్రకు కేరళ ప్రభుత్వం అభినందించింది. కరుణ విపత్కర సమయంలో ఓ మారుమూల గిరిజన ప్రజలకు వైద్యం అందించిన కేరళ వైద్యులను అందరూ ప్రశంసిస్తున్నారు.