Komatireddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓటుకు నోటు మాదిరిగానే.. పీసీసీ ఎంపిక జరిగిందని పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొత్త నేత ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్ పార్టీలో లెక్కలు మారుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Read More: Revanth Reddy: రేవంత్ రెడ్డికి సింహాసనం కాంగ్రెస్ కు ప్లస్సా? మైనస్సా??ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్!
అసలేం జరిగింది?
పీసీసీ ఎన్నిక అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీపీసీసీ టీడీపీ పీసీసీగా మారిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ అని విమర్శించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీపై విమర్శలు చేయనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గం జిల్లాకే పరిమితమవుతానని పేర్కొన్న కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు.
వాళ్లు ఎంట్రీ ఇచ్చారు….
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించి హైకమాండ్కు పంపారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర నేతలకు ఫోన్ చేశారు. పార్టీ నేత మల్లు రవికి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్ చేశారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఠాగూర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి తీరుపై మాణిక్కం ఠాగూర్ మండిపడినట్లు తెలిసింది. అదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?