Krishnapatnam Aanandayya: నెల్లూరుజిల్లా, కృష్ణపట్నం బొరిగి ఆనందయ్య ఇస్తున్న కరోనా ముందుకు జనం చీమలదండులా వస్తున్నారు.. ఈ మందు కళ్ళల్లో వేసిన కొద్ది నిమిషాలకే జనం లేచి కూర్చుంటున్నారు.. ఇప్పటికే ఐసీఎంఆర్ టీం కృష్ణపట్నం చేరి ఈ మందు గురించి అధ్యయనం చేస్తోంది.. తీర్ధాన్ని శంఖంలో పోస్తే నమ్ముతాం.. మందుల విషయంలో సైన్స్ చెబితేనే నమ్ముతాం.. అనే వారి కోసం.. ఈ మందు లో ఉపయోగిస్తున్న మూలికలు గురించి ఒక కెమిస్ట్రీ లెక్చరర్ కంప్లీట్ పూర్తి కెమికల్ చార్ట్ ను రూపొందించారు. ఈ క్రింది విధంగా విశ్లేషణ ఇచ్చారు..
కృష్ణపట్నం బొరిగి ఆనందయ్య ఇచ్చే నాటుమందులో అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, లవంగాలు, నేరేడు, మామిడి, నేలఉసిరి, కొండపల్లేరు, కుప్పింటాకు, తెల్ల జిల్లేడు పువ్వు, పట్టా, బుడ్డ బుడస ఆకు, ముళ్ల వంకాయ, పసుపు వంటి 16 మూలికలను ఇందులో ఉపయోగించి ఈ మందును తయారు చేస్తున్నారు.. అయితే ఈ మూలికల గురించి అసలు సైన్స్ లో ఏం ఉపయోగాలు చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అల్లం : అల్లం శ్వాసకోస వ్యాధులను నయం చేస్తుంది.
2.తాటి బెల్లం : ఆయుర్వేదంలో ఘాటయిన మొక్కలను ఔషధంగా ఉపయోగించిన్నప్పుడు దానిని తాటి బెల్లం తో తీసుకుంటారు..
3.తేనె : తేనె కఫాన్ని తగ్గిస్తుంది. ఔషధాలు నేరుగా శరీరంలో కలవడానికి చాలా రకాల ఔషధాలలో తేనెను కలుపుతారు.
4.నల్ల జీలకర్ర : నల్ల జీల కర్ర లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ మాంగనీస్ కాపర్ ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో థైమోక్వీనోన్ ఉంది. ఇది బయోయాక్టివ్ కంపోనెంట్ గా పనిచేస్తోంది. అంతేకాకుండా హానికర సూక్ష్మజీవులను, బ్యాక్టీరియాను శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబయాల్ ఉండడం వలన కడుపులో ఏర్పడే పురుగులను తొలగిస్తుంది. ఇంకా కడుపునొప్పి విరోచనాలు, గ్యాస్ట్రిక్, అధిక కొవ్వు, ఇన్సులిన్ సమస్యలను తొలగిస్తుంది.
5. తోక మిరియాలు : జలుబు, దగ్గు , కండరాల నొప్పి, స్వరపేటిక సమస్యలను నివారిస్తుంది.
6.లవంగాలు : ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, దగ్గును నివారిస్తుంది. దీనిలో యుజెనల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు శరీరంలోని సైటోకైన్లను తగ్గిస్తుంది. ఇంకా తలనొప్పి, మోకాళ్ల నొప్పులను కూడా నివారిస్తుంది.
7. వేప: వేప సహజ కీటకనాశిని. శరీరంలో ఉన్న బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. దగ్గు, కఫం, ఆస్తమా, శ్వాసకోశ, అతిసారం గ్యాస్, అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
8.నేరేడు : కాలేయాన్ని శుభ్ర పరచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
9. మామిడి : జ్వరాన్ని తగ్గించడానికి, కడుపులో పురుగులను తొలగించడానికి, కాలేయ సమస్యలను నివారించడానికి ఈ చెట్టు బెరడును ఉపయోగిస్తారు.
10. నేలఉసిరి : వైరల్ జ్వరాలకు ఇది చెక్ పెడుతుంది.
11.కొండపల్లేరు : ఆయాసం, ఉబ్బసం, క్షయవ్యాధి దగ్గు ను నివారిస్తుంది.
12.కుప్పింటాకు : దగ్గు, జలుబు , గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు, కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
13.తెల్ల జిల్లేడు పువ్వు: ఆస్తమాను నివారిస్తుంది. అంతేకాకుండా పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది.
14.పట్టా : ఇందులో యాంటీ వైరల్, యాంటీ సప్లమెంటరీ గుణాలు ఉన్నాయి.
15.బుడ్డ బుడస ఆకు : ఈ ఆకులో ఔషధ గుణాలు శరీరంలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది.
16.ముళ్ల వంకాయ : ఇందులో నొప్పులను కూడా ఔషధ గుణాలు ఉన్నాయి.
పైన తెలిపిన ఉపయోగాలు తెలుసుకుంటే కృష్ణపట్నం ఆనందయ్య ముందు ని ఒక కెమికల్ ఇంజనీర్ ఎలా తయారు చేస్తాడో అంత కంటే ఎన్నో రెట్లు ఉపయోగంగా తయారుచేశాడు.. ఆయుర్వేదం గురించి మూడు వేల సంవత్సరాల క్రితమే బుద్ధుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శాస్త్ర చికిత్సలు, బ్రెయిన్ సర్జరీ కూడా చేశారు. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిందే భారతదేశ ఆయుష్ విజ్ఞానం..