Prabhas KTR: మంత్రి కేటీఆర్ ఒక పక్క రాజకీయంగా మరో పక్క సినిమాల విషయంలో కూడా తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరవుతూ ఉంటారు. అటువంటి కేటీఆర్ తాజాగా ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ “ఆదిపురుష్” ఏపీ అజెండాలో భాగంగా తెరకెక్కిన సినిమా అని ఆరోపణలు చేశారు. ఒక “ఆదిపురుష్” మాత్రమే కాదు ‘ది కశ్మీర్ ఫైల్స్’..‘యూరీ – ది సర్జికల్ స్ట్రైక్స్’ కూడా బీజేపీ కనుసన్నల్లోనే తెరకెక్కిన సినిమాలు అని తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో కేటీఆర్ చేసిన కామెంట్లు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ తో సఖ్యతతో ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు రుజువైంది. టాలీవుడ్ ఇండస్ట్రీనీ ప్రోత్సహించే రీతిలో కూడా.. తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తూ ఉంటుంది. మరి ఇలాంటి వాతావరణంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్.. ప్రభాస్ సినిమాపై కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆది పురుష్” లో రాముడు పాత్రలో నటిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంకా రావణుడి పాత్రలో సైఫ్అలీఖాన్ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా… వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. మరి ఇటువంటి సినిమాకి రాజకీయ పార్టీతో ముడిపెట్టి కేటీఆర్ కామెంట్ చేయటం వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే కేటీఆర్ .. ఇటీవల గత కొద్ది రోజుల నుండి బీజేపీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ సినిమా పై కేటీఆర్ కామెంట్లు చేసినట్లు మరికొంతమంది భావిస్తున్నారు.