ఒకే ఒక్క రూపాయితో మీరే లక్షాధికారి కావొచ్చు.. అదెలాగంటారా.. అవునండి ఇది నిజం. ఒక్క రూపాయి నాణెం మీ దగ్గర ఉన్నట్టయితే మీరు పాతిక లక్షలు అక్షరాల 25 లక్షలు మీ సొంతం చేసుకున్నట్టే. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మత్రం నిజమేనండి… దీనికోసం ఇండియా మార్ట్ వెబ్ సైట్ ఇండియామార్ట్.కామ్ ను సంప్రదించవచ్చు. దీనికోసం మీరు చేయవల్సింది కొంత ఉందండోయ్.
మీరు ఈ మార్ట్ ను సంప్రదించాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. పాతిక లక్షలు మీ సొంతం కావాలంటే మాత్రం రూపాయి నాణెం పురాతణమైనదై ఉండాలి. మీ వద్ద అలాంటి పురాతన, అపురూప నాణెం గనక ఉన్నట్టయితే దాన్ని మీరు వేలంలో ఉంచి అక్షరాల 25 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు.
అయితే అది 1913 నాటి రూపాయి నాణెం కలిగి ఉంటేనే సాధ్యం అవుతుంది. వెండితో తయారుచేసిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియా మార్ట్ పై రూపాయలు 25 లక్షలుగా నిర్ణయించారు. ఈ పురాతనమైన ఈ నాణెంపై హనుమాన్ చిత్రం ముద్రితమై ఉంటుంది. 18వ శతాబ్దం నాటి నాణెం ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ధరను ఇండియామార్ట్ పై రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
మీ దగ్గర ఇలాంటి నాణేలు ఉండి మీరు గనక ఇలాంటి నాణేలను అమ్మదలచుకున్నట్టయితే ఇండియామార్ట్ వెబ్ సైట్ ఇండియామర్ట్.కాంమ్ ను సంప్రదించవచ్చు. అయితే ఈ వెబ్ సైట్ లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ర్టషన్ తర్వాత మీ దగ్గరున్న రూపాయి కాయిన్ను అప్లోడ్ చేసి వాటిని అమ్మకంలో ఉంచవచ్చు. ఇంకేందుకు ఆలస్యం మీ దగ్గర రూపాయి నాణెం ఉన్నట్టయితే వెబ్ సైట్ ను సంప్రదించి లక్షాధికారికండి.