బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొట్టమొదటి జంట ఎవరు అంటే రవి లాస్య అనే చెప్పాలి. ఇప్పుడు అంటే సుధీర్-రష్మీ, ఆది- వర్షిని, సుధీర్ విష్ణు ప్రియ వంటి వారు వైరల్ కానీ కొద్ది సంవత్సరాల క్రితమే వీరిద్దరూ కలిసి చేసిన షో హాట్ టాపిక్ అయిపోయింది. అయితే మధ్యలో విడిపోయి ఎవరి షో వారు చేసుకుంటున్న సమయంలో కూడా వీరిద్దరి గురించి అనేక రూమర్లు బయటకు వచ్చాయి. ఇక వాటిని బలపరుస్తూ వీరిద్దరు కలిసి కనిపించడమే మానేసారు.
మళ్లీ ఇన్ని రోజులకు ఈ సంక్రాంతికి వీరిద్దరూ కలుసుకోబోతున్నారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకే స్టేజి పైకి వచ్చారు స్టార్ మా ఆధ్వర్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో స్పెషల్ గా ప్లాన్ చేసిన సంక్రాంతి ఈవెంట్ లో కలిసి కనిపించారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన కోల్డ్ వార్ విషయం తెలిసిందే. అయితే ప్రోమో లో రవి లాస్య కు క్షమాపణలు చెప్పడం కూడా చూడవచ్చు. ఇక తాజాగా లైవ్ లోకి వచ్చిన యాంకర్ లాస్య అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
ఇదే సమయంలో సంక్రాంతి ఈవెంట్ గురించి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చింది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత తమ జంటను ప్రేక్షకులు ఆదరించడం చూసి ఎమోషనల్ అయింది. ఐదేళ్ల తర్వాత ఇలా వస్తున్నాం… నేను రవితో కలిసి యాంకరింగ్ చేస్తే జనాలు ఏమనుకుంటారో ఆదరిస్తారో లేదో అని భయపడ్డాను. అయితే అన్ని వైపుల నుండి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చింది. మళ్లీ వీరిద్దరూ కలిసి షో లు చేస్తారని వారు అభిమానులు ఇప్పటికీ భావిస్తున్నారు.