కరోనా వైరస్ కారణంగా ఎన్నో సినిమాలు ఓటిటి బాట పట్టాయి. అదే వరుసలో నాని, సుధీర్ బాబు నాయక ప్రతినాయకులుగా నటిస్తున్న ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని స్వయంగా ఈ రోజు నాని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పాడు. చాలా కారణాల వల్ల తాము ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 12 సంవత్సరాల పాటు నా కోసం మీరు థియేటర్లకు వచ్చారని అయితే ఈసారి మాత్రం అతనే మన ఇంటికి వచ్చి సందడి చేయబోతున్నాడని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ప్లాట్ ఒకటి ఇప్పటికే లీక్ అయినట్లు వార్తలు బయటకు వచ్చేశాయి. ఇక లీకయిన కథ విషయానికి వస్తే…. తన భార్య అదితి రావు హైదరి హత్యకు కారణమైన వారందరినీ హీరో నాని ప్రతీకారేచ్ఛతో చంపుతూ ఉంటాడని…. ఆ వరుసలో హత్యకు గురైన ప్రతి ఒక్కరి మృతదేహం వద్ద ద్వారా అనే ఒక ఇంప్ర్రెషన్ లేదా మార్క్ ను వదిలి వెళ్తాడని తెలుస్తోంది.
ఇక సుధీర్ బాబు ఈ చిత్రంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ వరుస మరణాల వెనుక ఉన్న అతనిని పట్టుకునేందుకు…. తర్వాత జరగబోయే హత్యలను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అసలు అదితి ని ఎవరు…. ఎందుకు చంపారు…? వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగిలిన స్టోరీ.
మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా…. దిల్ రాజు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రంగా నాని ‘టక్ జగదీష్’ గా కనబడనున్నాడు.