CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 28వ తేదీ సీఎం జగన్ కి చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే ఆ రోజు సీఎం జగన్ పెళ్లిరోజు.. అంతేకాకుండా ఆయన పెళ్లి ఆగష్టు 28వ తేదీకి 25 సంవత్సరాలు.. సిల్వర్ జూబ్లీ దినోత్సవం కావడంతో కుటుంబంతో కలిసి ప్రత్యేక టూర్ వెళ్లనున్నారని తాజా సమాచారం..!!
ఈనెల 26 నుంచి నాలుగు రోజుల పాటు సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాలలో గడిపేందుకు వెళ్లనున్నారు.. ఇటు కేవలం కుటుంబంతో మాత్రమే కలసి వెళ్లనున్నారు.. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక విమానం తో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.మరోవైపు ఐదు రోజులపాటు లండన్, పారిస్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించినున్నట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి కుమార్తె హర్ష రెడ్డి చదువు అంశంపై లండన్ లోని ప్రసిద్ధ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ అయినా ఇన్సిడ్ క్యాంపస్లో సీట్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఇన్సిడ్ క్యాంపస్లో జరిగే కార్యక్రమం తల్లిదండ్రులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అందుకని లండన్ వెళ్లనున్నట్లు సమాచారం.