Prabhas: “బాహుబలి” తర్వాత టాలీవుడ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలకు దేశంలోనే కాదు విదేశాల్లో భారీ మార్కెట్ ఏర్పడింది. అంతమాత్రమే కాదు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషలకు చెందిన హీరోలు ఎక్కువగా రీమేక్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లలో ఉన్న హీరోలు… తెలుగులో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ చేస్తున్నారు. చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీని ఇటీవల తెలుగులో తెరకెక్కిన కొన్ని సినిమాలు షేక్ చేసి పడేశాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను కూడా దాటుకుని కలెక్షన్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ రీతిగా తెలుగు సినిమా సత్తా ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంగమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్… మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వాళ్ళు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో తెలుగు వాళ్ళు బాగా కలిసిపోయారు అని కూడా పేర్కొన్నారు.మనమంతా గొప్ప దేశం అయినా భారత దేశానికి చెందిన వాళ్లమని కొనియాడారు. భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ ప్రస్తుతం దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ పెద్దది అన్న తరహాలో “బాహుబలి” రావటం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలకు గుర్తింపు అప్పట్లో ఎన్టీఆర్ వల్ల రాగా ఇప్పుడు స్టార్ హీరో ప్రభాస్.. ప్రపంచం తెలుగు వాళ్లను గుర్తించేలా చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చే స్థాయికి వెళ్లనున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి తెలుగు చలన చిత్ర రంగం పై ఈ కామెంట్ చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.