Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్న శిందే.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తాము శివసేనలోనే ఉన్నామనీ, శివసేనను ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు శిందే.. శిబిరంలో ఉన్న 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Maha Political Crisis: ఢిల్లీలో బీజేపి అగ్రనేతలతో మాజీ సీఎం ఫడ్నవీస్ చర్చలు
కాగా రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై స్పందించేందుకు జూలై 12వ తేదీ వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన నేపథ్యంలో అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. ఏక్ నాథ్ శిందే తన తదుపరి వ్యూహంలో భాగంగా గవర్నర్ ను కలిసి ఠాక్రే సర్కార్ పై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై పావులు కదుపుతోంది బీజేపీ. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలోని పరిణామాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. నిన్న రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి చర్చించిన ఫడ్నవీస్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ
మరో పక్క శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. ముంబైకి తిరిగి వచ్చేయండి.. నాతో మాట్లాడండి. మనం ఒ పరిష్కారం కనుగొందాం. మీలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు అంటూ రెబల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా మీరు గోహాతిలో చిక్కుకుపోయారు. ప్రతి రోజు మీకు సంబంధించి కొత్త విషయం బయటికి వస్తొంది. మీరు ఇప్పటికీ శివసేన హృదయంలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు నా వద్దకు వచ్చి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. శివసేన కుటుంబ పెద్దగా చెబుతున్నాను. మీ మనోభావాలను గౌరవిస్తాను. ముందు మీరు అయోమయాన్ని వీడండి.. ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కలిసి కూర్చుని చర్చించుకుందాం రండి. ఒకరి తప్పు కారణంగా మీరు ఉచ్చులో చిక్కుకోవద్దు. శివసేన ఇస్తున్న గౌరవం మీకు మరెక్కడా లభించద, మీరు ముందుకొచ్చి మాట్లాడితే ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది. శివసేన కుటుంబ పెద్దగా మీ పట్ల ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను వచ్చేయండి .. అందరం కలిసి ఆస్వాదిద్దాం అంటూ ఉద్దవ్ తన లేఖలో పేర్కొన్నారు.