Thaman: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మ్యూజిక్ పరంగా తమన్ టైం నడుస్తుంది. 2020లో ఆడియన్స్ ముందుకు వచ్చిన “అలా వైకుంఠపురం లో” మ్యూజికల్ గా అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ సినిమా నుండి తమన్ తనదైన శైలిలో కొత్త బాణీలు ఇస్తూ… సినిమా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అఖండ.. ఇంకా ఇటీవల వచ్చిన చాలా సినిమాలకు అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలావుంటే ఇటీవల తమన్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క…ఆహా లో తెలుగు ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాంలో జడ్జిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఎపిసోడ్ లో తమన్ చేసిన వ్యాఖ్యలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు మాస్ మహారాజా రవితేజ అభిమానులు సీరియస్ అయ్యారు. మేటర్ లోకి వెళ్తే గెలుపు ఇండియన్ ఐడల్ షోకి సంబంధించి ఫీనాలే ప్రెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ… తన కెరీర్లో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు సరైనోడు, రేసు గుర్రం, అలా వైకుంఠపురం లో… మూడు కూడా బన్నీతో ఉన్నాయ్ అని చెప్పుకొచ్చాడు. దీంతో తమన్ సంగీతం చేసిన వ్యాఖ్యలపై… మహేష్ మరియు రవితేజ అభిమానులు సీరియస్ అయ్యారు.
“కిక్”T తో రవితేజ ఇచ్చిన బ్రేక్ గుర్తు రాలేదా..? అని రవితేజ ఫ్యాన్స్ మరో పక్క మహేష్ బాబు అభిమానులు దూకుడు అదేవిధంగా బిజినెస్ మాన్.. రీసెంట్ గా “సర్కార్ వారి పాట” .. ఈ సినిమాలు ఎలా మర్చిపోయావు..అంటూ తమన్ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది ఏ ఎండకు ఆ గొడుగు అన్న తరహాలో ఆహా.. అల్లు అర్జున్ కి చెందిన సంస్థ కాబట్టి తమన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కమాన్ బన్నీ సినిమా లనే ప్రస్తావిస్తూ.. తన కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పటం పట్ల మిగతా హీరోల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.